*ఈ రోజు గ్రెహం స్టెయిన్ వారి ఇద్దరు పిల్లలు హతసాక్షులు అయిన రోజు..* 1999 జనవరి 22 అర్థరాత్రి ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్ పూరులో జరిగిన సంఘటన... భారత క్రైస్తవ చరిత్రలో అతి ఘోరమైన సంఘటన.. అమానుషమైన రీతిలో తమ జీవితాలు కాల్చబడి ప్రాణాలు కోల్పోయి దుర్బలమైన ఆకారముగా మిగిలిన సంఘటన.. ఏమిటా సంఘటన? అసలు ఏమి జరిగింది?. గ్రెహం స్టెయిన్స్ 1941వ సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో పుట్టారు, విలియం ఎలిజబెతులకు రెండవ సంతానంగా స్టెయిన్స్ జన్మించారు, తన 10వ ఏట ఒక సువార్త కూడికలో యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించారు, స్టెయిన్స్ మొదటిసారిగా 1965లో భారతదేశమునకు మిషనరీగా వచ్చారు, ఇవాంజెలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయుర్ బంజులో చేరి గిరిజన ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం ప్రారంభించారు, 1982వ సంవత్సరంలో మయుర్ బంజులో కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఒక ఆశ్రమం ప్రారంభించారు, 1983లో భారీపదలో కూడా సేవ చేయడం ప్రారంభించారు, అదే సంవత్సరము గ్లాడీసును పెళ్లి చేసుకున్నారు, వీరికి ముగ్గురు సంతానం వారు ఎస్తేరు, ఫిలిప్ తీమోతి, ఫిలిప్పుది మిషనరీ హృదయము అందరినీ ప్రేమించేవాడు, స్నేహితులు గాయపడిన వేళ నేర్పరివలే కట్లు కట్టి ప్రథమ చ
* తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడా? -పెద్ద కుమారుడా?* ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడుతండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్నిదినములైన తరు వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడునా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి--తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్ర
Comments
Post a Comment